కాపాడండి..జగన్ కి జీవిఎల్ లేఖ..!!
బీజేపీ ఎంపీ, సీనియర్ నేత అయిన జీవీఎల్ నరసింహరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖను రాశారు. అనంతపురం జిల్లా మీదుగా మడకశిర వరకూ నాలుగు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే అత్యంత పురాతనమైన లేపాక్షి సంపద, అత్యంత ప్రఖాతమైన బసవన్న విగ్రహం, వీరభద్రుడి ఆలయాలు ఉనికిని కోల్పోయే ప్రమాద ఉందని,ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని, స్థానికంగా ఉన్న కొందరు వైకాపా నేతలు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఈ విషయంపై కల్పించుకుని లేపాక్షి సంస్కృతికి సాంప్రదాయలను కాపాడాలని లేఖలో కోరారు జీవిఎల్.