“ఎంపీ” గారు ..ఏంటి ఇట్టా అయ్యింది..ఎం జరగబోతోంది..??
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై కేసు నమోదు చేసిన సిబీఐ స్పీడు పెంచింది. బ్యాంకులను మోసగించిన కారణంగా ఈ కేసులు నమోదు చేసినట్టుగా సిబీఐ అధికారులు పేర్కొన్నారు. అయితే తన ఇళ్ళు కార్యకలయాలపై ఎలాంటి దాడులు జరగలేదని, ఎలాంటి సోదాలు నిర్వహించలేదని, ఎంపీ రఘురామ కృష్ణం కూడా వివరణ ఇచ్చారు. అసలు
తన నియోజకవర్గంలోనే ఎలాంటి దాడులు జరగలేదని చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే అవును సోదాలు చేశామంటూ సిబిఐ ప్రకటించడంతో అసలు ఏపీలో ఏం జరగబోతోందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే
సిబిఐ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలో కన్సారిషియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా ప్రకటించింది సుమారు రూ. 826 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లుగా ఫిర్యాదు అందిందని తెలిపింది. అందులో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 11 ప్రాంతాలలో సోదాలు నిర్వహించినట్టుగా ప్రకటించింది.