బ్రేకింగ్ : రైతులకి కేంద్రం గుడ్ న్యూస్..!!
రైతన్నలకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. 2021 -22 సంవసత్సరానికి 6 రబీ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభలో ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులపై కేంద్రం కటినమైన నిర్ణయాలు తీసుకుంటోందని అపోహలును కల్పించి..
ప్రభుత్వానికి రైతులను దూరం చేస్తున్న క్రమంలో ఈ అపోహలను తొలగించడానికి మద్దతు ధర పెంచినట్టుగా తెలుస్తోంది . ఇదిలాఉంటే మద్దతు ధరల విషయానికి వస్తే. గోధుమలపై కనీస మద్దతు ధరను రూ. 50 కిపెంచింది. మసూర్ పప్పుపై రూ. 300, శనగలు రూ.250 కాగా, ఆవాలు రూ. 225 క్వింటాలకు పెంచేందుకు కేంద్ర ఆమోదం తెలిపింది.
రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందటానికి ప్రతిపక్షాలు రైతులను కొన్ని బిల్లులకు సంభందించి రెచ్చగొడుతున్న క్రమంలో రైతులను శాంతిపజేసేందుకు కేంద్రం మద్దతు ధరను ప్రకటించినట్టుగా ఉందని నిపుణులు విమర్శలు చేస్తున్నారు.