టాలీవుడ్ డ్రగ్స్ ఎడిక్ట్లు వీళ్లే…మొత్తం 19 మంది
డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ను విచారిస్తున్నప్పుడు అనేక షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. కెల్విన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా మొత్తం అతడు డ్రగ్స్ పంపిణీ చేసిన మొత్తం 19 మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు విచారిస్తామని కూడా ఎక్సైజ్ అధికారులు చెప్పారు.
ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే కెల్విన్ సినీ పరిశ్రమపై కన్నేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
నోటీసులు అందుకున్నది వాళ్లలో హీరోలు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు – హీరోయిన్ చార్మీ – ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ – టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు – ఆర్ట్ డైరెక్టర్ చిన్నా –
శ్రీనివాసరావు (రవితేజ డ్రైవర్) ఉన్నారు. ఇక మరి కొంత మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు రానున్నాయని తెలుస్తోంది.