కసాయి తండ్రి..స్మార్ట్ ఫోన్ మోజులో ఏమి చేశాడో తెలుసా..!!!
ప్రస్తుత సమాజంలో రక్త సంభందానికి విలువ లేకుండా పోతోంది. చివరికి తండ్రి అనే గొప్పదైన భంధం కూడా తాత్కాలిమైన సంతోషాల వైపు పరుగులు పెడుతూ కన్న భందాన్ని సైతం పక్కన పెట్టేలా చేస్తోంది. కొందరు తండ్రులు కన్న కూతుళ్ళపైనా అత్యాచారాలు చేస్తున్న సంఘటనలు వింటూనే ఉన్నాము..అయితే తాజాగా జరిగిన ఘటనలో ఓ తండ్రి తన సోకుల కోసం కన్నా కూతురునే అమ్మేశాడు…వివరాలలోకి వెళ్తే..
కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వ్యవసాయ కూలిగా పనిచేసుకుంటున్న ఓ వ్యక్తి కొత్త బండి, ఖరీదైన కొత్త స్మార్ట్ ఫోన్ తో ఉండటం గమనించిన స్థానికులు అతని కూతురు రెండు రోజులుగా కనపడక పోవడం గమనించారు. దాంతో అతడిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కన్న కూతురుని లక్ష రూపాయలకి అమ్మేశాడని, రూ.50 వేలుతో బండి కొనుగోలు చేశాడని, రూ.20 వేలుతో ఫోన్ కొనుగోలు చేశాడని తెలిపాడు. భార్య సైతం అతడికి సహకరించిందని తెలియడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం భార్యా భర్త, పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.