బ్యాంక్ ఉద్యోగులకు..పండుగ వేళ…”గుడ్ న్యూస్”
నిరంతరం ఖాతాదారుల సేవలో తరిస్తూ, వారి అవసరాలు తీర్చుతూ కరోనా సమయంలో కూడా అలుపెరుగకుండా పనిచేసిన బ్యాంక్ ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) గుడ్ న్యూస్ తెలిపింది. దీపావళి పండుగ వేళ పండుగలాంటి వార్త తెలిపింది. బ్యాంక్ ఉద్యోగుల జీతాలు 15 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త వేతన ఒప్పదం ఐబీఏ – ఉద్యోగ సంఘాల ఐక్య సమాఖ్య మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నవంబర్ -1 2017 నుంచి ఐదేళ్ళ పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగంలోని 12 ప్రవైటు రంగంలోని 10, విదేశీ బ్యాంకుల్లో పనిచేస్తున్న వారందరితో కలుపుకుని మొత్తంగా 8 .5 లక్షల మందికి ఈ లబ్ది చెకూరనుంది.