వాలంటీర్స్ కి జగన్ గుడ్ న్యూస్..!!
ఏపీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకి వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద అసెట్ అనే చెప్పాలి. వాలంటీర్లు చేస్తున్న నిస్వార్ధ సేవలు విలువ కట్టలేనివి కూడా. అయితే
ప్రస్తుతం వీరి కాలపరిమితి అయ్యిపోతున్న తరుణంలో వారి సేవలని మరో ఏడాది పాట కొనసాగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు లలో పనిచేస్తున్న వాలంటీర్ల సేవలను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో
సుమారు 2.6 లక్షల మంది వాలంటీర్లు మరో ఏడాది పాటు తమ విధులు నిర్వర్తించవచ్చునని తెలిపింది. దాంతో ప్రభుత్వం మరో 1560 కోట్ల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది.