జగన్ ఈ రెండు బిల్లులతో..బాబుకి షాక్ తప్పదా..???
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో రెండు కొత్త బిల్లులని ప్రవేశ పెట్టనున్నారు. గత కొన్ని రోజులుగా అమరావతి కేంద్రంగా జరగుతున్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజకీయాలకి చెక్ పెట్టేందుకు ఈ బిల్లులని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రవేశపెట్టబోయే ఈ బిల్లులలో ఒకటి ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభ్యున్నతి చట్టం 2020. రెండో బిల్లు, గత ప్రభుత్వం తెచ్చిన సీఆర్డీయే చట్టంలో కీలక మార్పులు తెస్తూ ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ మార్పు చట్టం 2020 ని ప్రవేశపెట్టనుంది.