డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్ నెలకి రూ. 3000 వారి ఖాతాలకే..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటగా ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్టుగా కూడా హామీలు ఇస్తూ ప్రజా రంజకంగా పాలన సాగిస్తున్నారు. డ్వాక్రా మహిళకలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ డ్వాక్రా మహిళలలో సంతోషం నిపుతున్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 2019 ఏప్రియల్ నెలలో తీసుకున్న ఋణాలు అన్నిటిని సెప్టెంబర్ 11 నాటికి మాఫీ చేయనున్నారు. ఈ క్రమంలోనే మహిళల వేలు ముద్రలు తీసుకుంటున్నారు. మాఫీ అయిన సొమ్ము నేరుగా వారి వారి ఖాతాలకే జమ అవనుందని తెలుస్తోంది. ఇదిలాఉంటే.
డ్వాక్రా సంఘాలలో 60 ఏళ్ళు పై బడిన మహిళలు సభ్యులుగా ఉండటానికి వీలు లేని కారణంగా వారిని తప్పించడం జరిగింది. అయితే తప్పించిన వృద్దాప్య మహిళలకు నెలకి రూ.3000 వేలు చప్పున ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ 3 వేల రూపాయలు వారికి వృద్దాప్య ఫించన్ తో పాటుగా వస్తాయని తెలుస్తోంది.