జియో కస్టమర్లకి… “భారీ ఆఫర్”..!!!!!!
జియో తన కస్టమర్లకి భారీ ఆఫర్ ని ప్రకటించింది. ఇప్పటికే టెలికం రంగంలో చెరగని ముద్ర వేసిన జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తో కస్టమర్లు వేరే నెట్ వర్క్స్ కి తరలి పోకుండా జాగ్రత్తలు పడుతునూనే ఉంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా జియో ఓ భారీ ఆఫర్ ప్రకటించింది.అదేంటంటే.
తన జియో కస్టమర్లకు 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది. అయితే అన్ని రిచార్జులపై ఈ ఆఫర్ వర్తించదని…కేవలం రూ.399 రిచార్జ్ పై మాత్రమే 100శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపింది. ఈ మొత్తాన్ని ఎజియో కూపన్ రూపంలో అందించనున్నారు.
మైజియో యాప్ ద్వారా రిచార్జ్ చేసుకున్న కస్టమర్లకు రూ.399 వెంటనే ఎజియో లో యాడ్ అవుతాయి..అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే..ఈ యాప్ ద్వారా కనీసం 1000 రూపాయల షాపింగ్ చేసిన వారు ఈ కూపన్ ను వాడుకోవచ్చు. జనవరి 31 2019 వరకు ఈ ఆఫర్ అందుబాలుటో ఉంటుంది