జర్నలిజం అంటే వాస్తవాన్ని నిర్భయంగా ప్రపంచానికి తెలియచేసే ఒక గొప్ప ఆయుధం.ఎంతో మంది జర్నలిజంలో నీతి ,నిజాయితీ గా ఉంటూ సమాజానికి ఉపయోగ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజాయితీ గా ఉన్న వారిపై దాడులు చేయడం,వారిని అంతమొందించడం మనం చూస్తూనే ఉంటాం.బెంగళూరులోజరిగిన ఒక ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
బెంగళూరులోని రాజ రాజేశ్వరి నగర్ లో నివాసం ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణంగా హత్య చేయబడ్డారు. అనేక మంది నాయకులు,పోలిసుల అవినీతి మీద చాలా కధనాలని రాశారు ఆమె. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్లో తన నివాసం గేట్ వద్ద గౌరీ లంకేష్ ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రాత్రి 8.25 నిమిషాలకు జరిగింది. జర్నలిస్టు గౌరీ లంకేష్ను హత్య చేశారని సిటీ పోలీసు కమిషనర్ టీ సునీల్ కుమార్ నిర్ధారించారు. పోలీసులు గౌరీ పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకొని జర్నలిస్టు హత్యకు దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నారు.