నంద్యాల ఉపఎన్నిక ఫలితం ఇప్పుడు కాకినాడ ఫలితం మీద తీవ్ర ఉత్ఖంతనిపెంచుతోంది. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే ఏడు చోట్ల టీడీపీ ఆధిక్యాన్ని కనబర్చింది. 1వ డివిజన్లో పేరాబత్తుల లోవబాబు (టీడీపీ),40 డివిజన్లో “టీడీపీ” అభ్యర్థి సుంకర శివప్రసన్న,16 డివిజన్లో టీడీపీ అభ్యర్థి మల్లారి.గంగాధర్, 34వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి 700 తేడాతో గెలుపొందారు. 22 డివిజన్ లో కిషోర్ (వైసీపీ), 37 డివిజన్ లో కర్రి దేవిక గెలుపొందారు. హోరాహోరిగా సాగుతున్న ఈ కౌంటింగ్ కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది.