నంద్యాల ఉపఎన్నిక క్షణ క్షణానికి తీవ్రవైన ఉత్ఖంతని రేకెత్తిస్తోంది.ఎప్పుడు ఏ రౌండ్ లో ఎలా రిజల్ట్స్ వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్లో మూడవ రౌండ్ పూర్తయింది. రెండు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న టీడీపీ మూడో రౌండ్లోనూ లీడ్లో ఉంది. మూడో రౌండ్లో 3113 ఓట్ల ఆధిక్యంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. టీడీపీ మొత్తం ఓట్లు 6073 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. కాగా ఉదయం 9:30 గంటల సమయంలో టీడీపీ: 11802, వైసీపీ: 9039, కాంగ్రెస్: 150 ఓట్లతో లెక్కింపు కొనసాగుతోంది.