నంద్యాల ఉపఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యంలో నిలిచారు. సమీప వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డిపై 1295 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. కాగా మొదటి రౌండ్లో టీడీపీకి 5474 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 4179 ఓట్లు వచ్చాయి.ఇటు వైసీపి, టీడీపి శ్రేణులలో తీవ్రమైన ఉత్ఖంట నెలకొంది.