నంద్యాల సమరం- నాలుగో రౌండ్ రిజల్ట్స్
ఓటరు నాడి ఎలా ఉందో నంద్యాల ఉపఎన్నికల్లో తెలుసుకోవడం చాలా కష్టమనే చెప్పాలి.వైసీపి కి అనుకూలంగా రిజల్ట్స్ వస్తాయి అని అందరు భావిస్తున్న తరుణంలో మొదటి, రెండవ,మూడు రౌండ్లలో టీడీపి ఆధిక్యాన్ని కనబరిచింది.ఇది ఇలా ఉంటే వైసీపి తమ గెలుపు విషయంలో చలా ధీమాగా ఉంది ఇంకా కౌంటింగ్ పూర్తీ కాకుండా ఏకపక్షంగా మాట్లాడటం సరైనది కాదు అని చెప్తోంది.
.నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్లో నాలుగో రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్లోనూ టీడీపీకి ఆధిక్యం వచ్చింది. తొలి మూడు రౌండ్లతో పోలీస్తే.. ఈ రౌండ్లో ఆధిక్యం భారీగా వచ్చింది. నాలుగో రౌండ్లో 3600 ఓట్ల ఆధిక్యంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. టీడీపీ మొత్తం ఓట్లు 9673 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతుంది. నాలుగు రౌండ్లు ముగిసేసరికి
టీడీపీ: 17,697, వైసీపీ: 11,624, కాంగ్రెస్: 211 ఓట్లతో లెక్కింపు కొనసాగుతోంది.
మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5474 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి 4179 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి రౌండ్లో టీడీపీ 1295 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
రెండో రౌండ్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4726 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి 3945 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్లో టీడీపీ 1634 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
మూడో రౌండ్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 7058 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి 3126 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్లో టీడీపీ 3,113 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఇప్పుడు టీడీపి ఐదవ రౌండ్ లో కూడా తన ఆధిక్యాన్ని కనబరుస్తోంది
Also Read: Related links..
http://www.telugustarnews.com/telugu/nandhylaa-elections-first-round-results/
http://www.telugustarnews.com/telugu/nandhyla-elections-second-round-results/
http://www.telugustarnews.com/telugu/nandhyla-thirdround-results/
.