రేవంత్ పై “ఐటీ దాడి”…బీజేపీ “వ్యూహమేనా”..?
ఓటుకు నోటు కేసు విషయం చల్లారి పోయిందని అనుకున్న టీడీపీ నేతలకి ,రేవంత్ రెడ్డి కి కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చాడు..ఈరోజు ఉదయం నుంచీ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేయించారు కేసీఆర్. తెలంగాణలో ముందస్తుకి తెరతీసిన కేసీఆర్ అసెంబ్లీ ని రద్దు చేసి దూకుడుగా వెళ్తుంటే చంద్రబాబు కూటమిలో జతకట్టి కేసీఆర్ ని గద్దె దింపాలని చూస్తున్నాడు అయితే ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితిలో అధికారం వదులుకోకూడదు అనుకున్న కేసీఆర్ బాబు కి చెక్ పెట్టి రేవంత్ ని కంట్రోల్ లో పెట్టడానికి మళ్ళీ ఓటుకు నోటు తెరపైకి తీసుకోవచ్చాడు ఈ క్రమంలోనే
ఓటుకు నోటు కేసులో రూ.5 కోట్లు చేతులు మారాయని, ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ పోలీసులు ఈడీకి లేఖ రాశారని అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డి ఇళ్లపై ఈడి దాడులు జరిగినట్లు చెబుతున్నారు. నిజానికి, ఏదో విధంగా రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేసే పని జరుగుతుందని అందరూ ఊహించిందే. రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఊహించారు. జగ్గారెడ్డి అరెస్టు, శ్రీశైలంపై కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అటువంటి చిక్కులు తప్పవనే ప్రచారం సాగుతూ వస్తోంది…అయితే కేసీఆర్ ఈ తతంగం నడిపించడం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది.