చిరంజీవి 2009 లో ప్రజారాజ్యం స్థాపించాడు.చిరు కి ఈ పార్టీ వలన ఏమీ కలిసి రాలేదు గానీ చాలా మంది నేతలు మటుకు పిచ్చ పాపులర్ అయ్యారు.వారిలో ఒకరు ఆ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి. ప్రజారాజ్యం పార్టీమీద ఈగ వాలినా ఊరుకోని శోభా ప్రజారాజ్యం పార్టీ ఎత్తేయక ముందే తానూ తప్పుకున్నారు . పరకాల నాడు చిరుకు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ వారిలో ఒకరిగా నిలిచిన ఇప్పటి ప్రభాకర్ లాంటి వాళ్ళు చిరు మీద విమర్శలు చేసినపుడు,పరకాల మాటలని తిప్పికొట్టి తన సత్తా చాటింది శోభారాణి. అలాంటి శోభారాణి పరకాల లానే ప్రజారాజ్యం మీద దుమ్మెత్తి పోసి సంచలనం .
అప్పట్లో శోభా చిరంజీవికి లేక రాస్తూ ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం ఏది..అంటూ నిలదీశారు. ఇక అదే వరుసలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్తో పెళ్లి చేసుకున్నారంటూ శోభారాణిపై వార్తలు వచ్చాయి దాంతో మరింత పుబ్లిసిటీ వచ్చేసింది .ఆతరువాత శోభారాణి ఎక్కడ ఉంది ఏమి చేస్తోంది అన్న విషయం ఎవ్వరికి తెలియదు . అప్పటినుంచీ ఏ ఒక్కరికి కూడా కనిపించకుండా పోయిన శోభారాణి నిన్న హఠాత్తుగా గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ సీనియర్ నేతలు మంత్రి నక్కా ఆనందబాబు,గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమక్షంలో ఆమె టీడీపీలో చేరిపోయారు.
ఓ సమర్థవంతమైన మహిళా నేత తిరిగి తమ గూటికి వచ్చిందంటూ టీడీపీ వర్గాలు జబ్బలు చరుచుకుంటున్న వైనంపై ఆ పార్టీలోపలే ఓ తరహాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా రాజ్యంలో ఉండి ఎం చేసింది అని సమర్ధవంతమైన మహిళా అంటునారు అని. ఓ మహిళా రాజకీయ వేత్త, కొంత కాలం పాటు పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ మరలా రాజకీయాల్లోకి రావాలని అనుకున్న శోభారాణి ని అందరూ మెచ్చుకోవాల్సిందే .మరి టీడీపి లో అయినా శోభారాణి ఉంటుందా లేదా అనేది కాలమే చెప్పాలి