షాకింగ్ – తల్లైన ప్రియాంక చోప్రా
ఈ వార్తా ఒక్క సారిగా ప్రియాంక చోప్రా కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులని ఆశ్చర్య పరిచింది..ఒక్క సారి గా అందరూ షాక్ కి గురయ్యారు..ఎవరికి వారు ఎవరికి తోచింది ఊహించుకుంటున్నారు..పెళ్లి కూడా కాలేదు కదా ప్రియాంక తల్లి అవ్వడం ఏంటి అంటూ మండిపడుతున్న వాళ్ళు లేకపోలేదు..అయితే ఈ వార్తలో అసలు నిజం ఏమిటంటే..ప్రియాంక తల్లి కావడం నిజమే అయితే అది సినిమాలో మాత్రమే నిజ జీవితంలో మాత్రం కాదు అంటూ అందరి ఊహలకి బ్రేక్ ఇచ్చారు..ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఒక ప్రతిష్టాత్మకమైన పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతోంది…జైరాకు తల్లిగా ప్రియాంక ఓ నిజ జీవిత కథలో నటించబోతుంది దర్శకురాలు సోనాలీబోస్ తెరకెక్కిస్తున్న చిత్రం “ది స్కై ఈజ్ పింక్ ” ఇందులో “జైరా వాసీమ్” కీలక పాత్రధారి. ఈ చిత్రంలో ప్రియాంకకు జోడీగా అభిషేక్బచ్చన్ను అనుకొన్నారు…అయితే ఏమయ్యైందో ఏమో కానీ చివరి నిమిషంలో అభిషేక్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానంలోకి ఫర్హాన్ అక్తర్ వచ్చాడు. “దిల్ దడక్నే దో” తర్వాత ప్రియాంక , ఫర్హాన్ కలిసి నటిస్తున్న చిత్రమిది.
అయితే ఈ చిత్రంలో జైరాకు తల్లిదండ్రులుగా నటించనున్నారు ప్రియాంక, ఫర్హాన్ లు “ పల్మనరీ ఫైబ్రోసిస్ ” వ్యాధితో 18 ఏళ్లకే చనిపోయిన అయేషా చౌదరి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తనకు ఆ వ్యాధి ఉందని 13 ఏళ్ల వయసులో తెలిసినా ధైర్యం కోల్పోకుండా ఓ ప్రవక్తలా మారి సమాజానికి ఎంతో స్పూర్తి దాయకమైన ఉపయోగపడే ఉపన్యాసాలు చేసింది అయేషా…అన్తెకాదూ ఆమె “ మై లిటిల్ ఎపిఫనీస్” పేరుతో పాజిటివ్గా బతకడం గురించి ఓ పుస్తకం కూడా రాసింది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.