బ్రేకింగ్ : కంచుకోటలో టీడీపీకి బిగ్ షాక్..ఏకంగా….

ఏపీలో టీడీపీ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. జగన్ పై ఏపీ ప్రజలకి రోజు రోజుకి అభిమానం పెరుగుతూ, నీరాజనాలు పడుతుంటే టీడీపీ నేతలకి దిక్కు తోచడంలేదు. అయినా సరే ఎదో ఒక ఒంకతో జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ ఒకవైపు ఆరోపణలు చేస్తుంటే మరో వైపు టీడీపీ నేతలు, క్యాడర్ చాలా చోట్ల పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. తాజాగా

టీడీపీ కి కంచుకోటగా ఉన్న విజయవాడలో దాదాపు 150 మంది టీడీపీకి చెందిన కార్యకర్తలు లీడర్స్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ లోకి చేరిన ఈ 150 మంది జగన్ మోహన్ రెడ్డి పాలన, ఆయన చేపడుతున్న ప్రజా సంక్షేమ పధకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు. ఈ సందర్భంలో వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భవిష్యత్తులో మరింత మంది టీడీపీ నేతలు కార్యకర్తలు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *