చంద్రబాబు కు బిగ్ షాక్..పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై..??
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏపీలో జగన్ దూకుడికి ఎలా బ్రేకులు వేయాలోనని ఒక పక్క చంద్రబాబు ఆలోచిస్తుంటే మరో పక్క జగన్ పరిపాలన పట్ల ఆకర్షితులై జగన్ పంచన చేరడానికి టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ కీలక నేతలుగా ఉన్న వల్లభనేని వంశీ, కారణం బలరాం, మద్దాలి గిరి జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు తెలుపగా తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా టీడీపీని విడిచి వైసేపీలోకి చేరనున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది.
నేడు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తరువాత తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది. టీడీపీలో ఎమ్మెల్యే గా రాజీనామా చేయకుండా బయట నుంచీ వైసీపీకి మద్దతు ఇస్తూ వంశీ, కారణం బలరాం బాటలో నడవనున్నారని తెలుస్తోంది..