చాలా రోజుల తరువాత ప్రేక్షకులని టాలీవుడ్ మూడు సినిమాలతో అలరించింది ముగ్గురు యువహీరోలు కావడం ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉండటం వలన ప్రేక్షకులు మూడు సినిమాలని ఆదరిస్తున్నారు అయితే ఈ ఆగష్టు రెండవ వారంలో ఈ మూడు సినిమాలు రావడం ఈ వారంలోనే వరుస సెలవలు రావడం తో నిర్మాతలకి లక్ అనే చెప్పాలి.రిలీజ్ అయిన ఈ సినిమాలు ఎదీ కూడా ఫ్లాప్ టాక్ రాలేదు అన్నీ మంచి టాక్ తెచ్చుకున్నాయి దీంతో ప్రేక్షకులు ఒక సినిమా తరువాత మరొక సినిమాలకి క్యూ కడుతున్నారు.
ఇక ఈ మూడు సినిమాలకు ఓవర్సీస్ నుంచి ప్రీమియర్ షో కలెక్షన్ల రిపోర్ట్ వచ్చేసింది. రానా “నేనే రాజు నేనే మంత్రి” $140,833 కలెక్షన్లను రాబట్టి మొదటి స్థానంలో నిలువగా, నితిన్ “లై” $50,623 సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక చివరగా బోయపాటి దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” $8,535 లను సాధించి ఓవర్సీస్ ప్రీమియర్ షోలో పరవాలేదనిపించింది.
కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రం ఓవరాల్ గా 130 స్క్రీన్లలో రిలీజ్ అవ్వడంతో పాటు ,ప్రమోషన్లు భారీగా చేస్తూ , ముందస్తు అడ్వాన్స్ బుకింగ్లు ఎక్కువ కావడంతో మంచి వసూళ్లు రాబట్టి,ఇక రానా బాహుబలి ఇమేజ్ రానా మీద ప్రభావం చూపించి . ఇక నితిన్ లై మల్టీఫ్లెక్స్ మూవీ కావడంతో ఆ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. బోయపాటి సినిమా అంటేనే మాస్ ప్రేక్షకులకి మంచి ఉత్ఖంట ఉంటుంది అయితే హీరో హావభావాలు చిన్న చిన్న లోపాల వలన పరవాలేదు అనిపించింది మొత్తానికి ఈ వారం మొత్తం ప్రేక్షకులని టాలీవుడ్ మూడు సినిమాలు అలరిస్తాయి అనడంలో సందేహం లేదు