చైనా కి మరో బిగ్ షాక్…దెబ్బ మీద దెబ్బ…!!!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంతగా పట్టి పీడిస్తోందంటే దానికి ప్రధాన కారణం చైనానే దాదాపు అన్ని దేశాలు ఓ నిర్ణయానికి వచ్చేశాయి. చైనా పై సరైన సమయంలో దెబ్బ కొట్టడానికి అదును వెతుకుతున్నాయి. కానీ అగ్ర రాజ్యం అమెరికా మాత్రం ఈ విషయంలో ఒకడుగు ముందుందనే చెప్పాలి. టిక్ టాక్ ని అన్ని దేశాలకంటే భారత్ లో ముందుగానే బ్యాన్ చేయగా కొన్ని దేశాలు కూడా అదే దారి పడ్డాయి..తాజాగా అమెరికా టిక్ టాక్ పై గడువుతో కూడిన నేషేధాని విధించగా తాజాగా మరో చావు దెబ్బ కొట్టింది..
అమెరికాలో ఉన్న చైనా ఐటీ దిగ్గజ కంపెనీ ఆలీబాబా పై కొరడా ఘులిపించింది. అమెరికాలో ఆలీబాబా ని నిషేధించాలనే నిర్ణయం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. త్వరలో అమెరికాలో ఇక ఆలీబాబా సంస్థ ఉండదు అంటూ సంకేతాలు ఇచ్చారు..