కొడుకు భార్యతోనే మామ ప్రేమాయణం…షాకింగ్ క్లైమాక్స్
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో కొడుకు భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ కామాంధుడు. తక కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన సదరు వ్యక్తి ఆమెతోనే శృంగారం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వారిద్దరిని మందలించారు. చివరకు వారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నెలన్నరో రోజుల పాటు బయట తిరిగి చివరకు ఇంటికి వచ్చిన వారికి చీత్కారాలే ఎదురయ్యాయి. చివరకు వారిద్దరు చనిపోవాలని డిసైడ్ అయ్యి ఆత్మహత్యాయత్నం చేశారు. చివరకు మామ బతికి బయటపడగగా, కోడలు మృతి చెందింది. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ ఎర్రగోడి తండాకు చెందిన అనిత (25)ను ఆమె తల్లిదండ్రులు డోర్నకల్ మండలం చిలుకోడుకి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.
ఆమె పెళ్లి అయిన కొద్ది రోజులకే తన భర్త తండ్రి, తనకు మామ అయిన వీరన్నతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించడంతో మామతో కలిసి ఇంట్లో, భర్త డబ్బు, బ్యాంకు ఏటీఎం కార్దు తీసుకొని మామ, కోడలు పారిపోయారు. వారు కొద్ది రోజులు చెన్నైలో ఉన్నారు. ఆ తర్వాత వారు పలు ప్రాంతాల్లో తిరిగి ఎంజాయ్ చేశారు. చివరకు ఆమె భర్త ఏటీఎం కార్డు ఖాతా నిలిపివేయడంతో వారి దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. నెలన్నర రోజుల తర్వాత మామాకోడళ్లు ఇంటికి తిరిగివచ్చారు.
అనిత ఆమె సొంత ఊరు తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే ఆమెని తలిదండ్రులు ఛీ కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేసారు. అలాగే ఊళ్ళో వాళ్ళు అవమానకరంగా మాట్లాడటం మొదలెట్టారు. దీంతో చేసిన తప్పు తెలుసుకున్న అనిత, తనకు చావు తప్ప మరో అవకాశం లేదని, బతికే హక్కు లేదని భావించి ఆత్మహత్య చేసుకుంది.
ఆ విషయం చివరిగా లేఖలో రాసి చనిపోయింది. ఆమెతో పాటు ఆమె మామ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఊరి చివర వాళ్ళని గుర్తించిన స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే అనిత మరణించగా, ఆమె మామ మాత్రం కోన ఊపిరితో బతికి, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.