సమంత ప్లాన్ సూపర్…నలుగురు టాప్ హీరోలతో ఒకే సారి…!!
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సక్సెస్ తో ముందుకు దూసుకుపోతూ, దక్షిణాదిన ఆగ్రస్థానంలో ఉన్న హీరొయిన్ సమంత. తెలుగు,తమిళ భాషల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మనం సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక అక్కినేని ఫ్యామిలీ లోకి అడుగు పెట్టిన తరువాత సమంత గ్రాఫ్ పడిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఒక పక్క సినిమాలు చేయడం తగ్గిపోవడం, మరో పక్క చైతు, సమంతల మధ్య గ్యాప్ పెరగడంతో మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంది. ఈ క్రమంలో కొంత గ్యాప్ తరువాత లేడీ ఓరియంట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సమంత ఈ సినిమా ప్రమోషన్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది.
పాన్ ఇండియా లెవిల్ లో ఈ సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి సమంత పెద్ద ప్లానే వేసింది. తెలుగు, కన్నడ, తమిళ, బాషల్లోనే కాకుండా హిందీ లో కూడా ఈ సినిమా విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా టీజర్ కు అనూహ్య స్పందన లభించడంతో టీజర్ ను విడుదల చేయడానికి సిద్దమయ్యింది టీజర్ చూసిన అభిమానులు ట్రైలర్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణంలో అభిమానులకు మరింత ఆసక్తి కలిగించేలా ట్రైలర్ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేసింది.
“యశోద” మూవీ ట్రైలర్ ను ఒక్కో భాషలో ఒక్కో టాప్ యాక్టర్ విడుదల చేయనున్నారు. తమిళ్ వెర్షన్ ను హీరో సూర్య , మలయాళంలో దుల్కర్, తెలుగు లో విజయ దేవరకొండ, కన్నడలో రక్షిత్ శెట్టి విడుదల చేయబోతున్నారు. మొత్తానికి సమంతా సినిమా ట్రైలర్ ఆ నలుగురు టాప్ హీరోలు చేతుల మీదుగా విడుదల కాబోతోంది.