వైఎస్ జగన్ ఇంట విషాదం..!!!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. జగన్ పెద్ద మామ అయిన పెద్ద గంగిరెడ్డి మృతి చెందారు. జగన్ సతీమణి వైఎస్. భారతీ రెడ్డి కి ఆయన స్వయానా పెదనాన్న. గడించిన కొంత కాలంగా గంగిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని, పులివెందులలో ఉన్న ఓ ప్రవైటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన స్వగ్రామం గొల్లలగూడూరు చేరుకున్నారు. అయితే

నిన్నటి రోజున ఆయన పరిస్థితి క్షీణించడంతో మరలా పులివెందుల తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గ మద్యలోనే తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. ఆయన భౌతిక కాయాన్ని సొంత ఊరు గొల్లలగూడూరుకి తరలించారు. ఈ విషయం తెలియగాని సీఏం జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరమర్సించగా, ఆయన సతీమణి భారతి తల్లి విజయమ్మ గొల్లలగూడూరు గ్రామం చేరుకొని గంగిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *