చంద్రబాబుకు జగన్ సవాల్..
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపి గెలవడం చంద్రబాబు నాయుడి విజయం అనుకుంటే అది తన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని జగన్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేసిన ఓటర్లకు, ప్రలోభాలు, భయభ్రాంతుల మధ్య పార్టీ కోసం నిలబడి కష్టపడ్డ కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల రిజల్ట్స్ అనంతరం విలేకరులతో మాట్లాడారు వైఎస్ జగన్
శిల్పా సోదరులకి కృతజ్ఞతలు
అధికార పార్టీలో ఉండికూడా తమ పదవులకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీలోకి వచ్చిరాజకీయ విలువలని మరింత పెంచిన శిల్పా చక్రపాణి,మోహన్ రెడ్డి లకి నా హాట్సాప్ . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ విలువలకు కట్టుబడే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం చేసింది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసింది. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది అని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చెప్పారు .