చంద్రబాబుకు జగన్ సవాల్..

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపి గెలవడం చంద్రబాబు నాయుడి విజయం అనుకుంటే అది తన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని జగన్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటు వేసిన ఓటర్లకు, ప్రలోభాలు, భయభ్రాంతుల మధ్య పార్టీ కోసం నిలబడి కష్టపడ్డ కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల రిజల్ట్స్ అనంతరం విలేకరులతో మాట్లాడారు వైఎస్ జగన్

శిల్పా సోదరులకి కృతజ్ఞతలు
అధికార పార్టీలో ఉండికూడా తమ పదవులకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చిరాజకీయ విలువలని మరింత పెంచిన శిల్పా చక్రపాణి,మోహన్ రెడ్డి లకి నా హాట్సాప్    . వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ విలువలకు కట్టుబడే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం చేసింది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసింది. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది అని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చెప్పారు .

నంద్యాలలో టీడీపీ గెలుపు చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటు. ఇది దిగజారుడు రాజకీయం మాత్రమే. ఎన్నికలలో హామీలు ఇచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. సాధారణ ఎన్నికలు కాదు కాబట్టే టీడీపీ గెలిచింది. చంద్రబాబు తన అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు. రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎన్నిక రిఫరెండం కాదు. చంద్రబాబుకు ఇప్పుడు సవాల్‌ విసురుతున్నా. మా పార్టీ గుర్తుపై గెలిచి, అనంతరం టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తాం.’ అని అన్నారు.అప్పుడు ఇదే పందాలో 20 స్థానాల్లో 200కోట్లు ఖర్చు చేయగలరా ? అధికార దుర్వినియోగానికి పాల్పడ లరా? అని ప్రశ్నించారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *