జగన్ కి ఇదో పునర్జన్మ…!!!
ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన వైఎస్ విజయమ్మ తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు..ఒక ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ఇదేనా మీరు అవలంభిస్తున్న తీరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు..అంతేకాదు ఇప్పటి వరకూ కేసుపై ఒక్క ప్రకటన చేయలేక పోయారు..దాడి జరిగి నాబాబు భాదపడుతుంటే మీరు నవ్వుతూ ప్రెస్ మీట్ లు పెడుతారా మీరు అలిపిరి దాడిలో భాదపడుతుంటే నా భర్త ఇలానే చేశారా అంటూ విజయమ్మ చంద్రబాబు కి దిమ్మరితిగే ప్రశ్నలు సంధించారు..
దాడి జరిగిన రోజు మొదలు ఇప్పటి వరకూ కూడా జగన్ కోసం అభిమానులు ఎంతో ఆరాట పడ్డారు ప్రార్ధనలు చేశారు.మా కుటుంభానికి అండగా నిలిచారు..ఇక ముందు కూడా జగన్ కి రక్షణగా ఉండవలసిన భాద్యత మీదే.గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తున్నా నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నా ఇక మీదే భాద్యత అంటూ విజయమ్మ ప్రెస్ మీట్ ఎంతో ఉద్వేగంగా సాగింది.
నా జగన్ బాబు కోలుకున్నాడు..మళ్ళీ మీ వద్దకి వస్తున్నాడు అందరూ ఆదరించండి.జగన్ ని పజలె కాపాడు కున్నారు అంటూ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకునారు..ఇది జగన్ కి పునర్జన్మ అంటూ విజయమ్మ గుక్క తిప్పుకోకుండా చెప్పినా మాటలు టీడీపీ అధినేత కి నేరుగా తగిలాయి…నా భర్తని పోగొట్టుకున్నాను ఇక ఇప్పుడు నా కొడుకుని పోగొట్టుకోవాలా మీరు ఇచ్చే సెక్యూరిటీ ఇదేనా అంటూ బాబు పై విజయమ్మ ఫైర్ అయ్యారు.