పవన్ కు రైతుల బాధలు వినిపించిన…”వైసీపీ ఎమ్మెల్యే తండ్రి”
నివర్ తుఫాను ప్రభావిత జిల్లాలలో పర్యటనలు చేసిన పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడారు. పంటలకు ఏ మేర నష్టం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి సాయం అందించింది. అంటూ వారితో మాటలు కలిపారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాలలో పర్యటన చేసిన జనసేనాని తాను రాజకీయాలు చేయడానికి రాలేదని ముందుగానే ప్రకటించుకున్నారు.
వరదల్లో పంట నష్టపోయిన రైతుకు రూ.10 వేలు సాయం ప్రకటిస్తే అదే పదివేల రూపాయలు ఐదు ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇవ్వడం ఎంత వరకూ సమాజసం అంటూ ప్రశ్నించారు. ఎకరానికి రూ. 25 వేల నుంచి. రూ . 30 వేల వరకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం చేస్తామని హామీ ఇచ్చారు..ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ జరిగింది…
నివర్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.#NivarCyclone #JSPWithFarmers
Full Album : https://t.co/wGZmy1fPGX pic.twitter.com/BT0YIaTqvn
— JanaSena Party (@JanaSenaParty) December 2, 2020
పవన్ పర్యటనలో వైసీపీ ఎమ్మెల్యే, జగన్ కి సన్నిహితుడిగా పేరొందిన పార్ధ సారధి తండ్రి మాజీ ఎంపీ పెద్ద రెడ్డయ్య ఒక్క సారిగా ప్రత్యక్ష మయ్యారు. పెద్ద పూడి అడ్డరోడ్డు వద్ద పవన్ ను కలిసి న ఆయన రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఒక్క సారిగా వైసీపీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి. పెద్ద రెడ్డయ్య మాటలు విన్న పవన్ కళ్యాణ్ త్వరలో రైతుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామని అన్నారు. అందుకు నేను కూడా వస్తానని పెద్ద రెడ్డయ్య తెలిపారు. దాంతో జనసేన శ్రేణులు పెద్ద రెడ్డయ్య పవన్ ని కలిశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే
తండ్రి కొడుకుల మధ్య వైరం వచ్చిందా లేక మరే ఇతర కారణాల వలన పెద్ద రెడ్డయ్య పవన్ ని కలిశారా అనే క్లారిటీ ఇంకా రాలేదు. కానీ వైసీపే ఎమ్మెల్యే తండ్రి రైతులు బాధలు పడుతున్నారని పవన్ కి విన్నవించడం మాత్రం వైసీపీ కార్యకర్తలు , నేతలకు మాత్రం కోపాన్ని తెప్పిస్తున్నాయనేది మాత్రం తెలుస్తోంది.