చిరంజీవి చేతిలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…అసలు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…
పసివాడి ప్రాణం సినిమా చిరంజీవి నటించిన సినిమాలు అన్నిటికంటే చాలా ద్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక బాబు చుట్టూ తిరిగే ఈ సినిమా చిరంజీవి అభిమానులను అప్పట్లో ఉర్రూతలూగించింది. అప్పట్లో చిరంజీవి సినిమాలు అంటే అలాంటిలాంటి క్రేజ్ కాదు. ఎప్పుడెప్పుడు చిరు సినిమా విడుదలవుతుందా అంటూ వెయ్యి కళ్ళతో వేచి చూసేవారు. అప్పటివరకూ చిరు నటించిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఈ సినిమా మాత్రం ఎంతో వైవిధ్యభరితంగా ప్రేక్షకులను మెప్పించింది.
చిరు కెరియర్ ను మలుపుతిప్పిన సినిమాలలో పసివాడి ప్రాణం ఒకటని చెప్పచ్చు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పసివాడు రాజు ను కాపాడటం కోసం చిరంజీవి చేసే పోరాట సిన్నివేసాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో కుర్ర కారును ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ సినిమాలో పసివాడు గా నటించి అందరిని మెప్పించిన ఆ రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎవరు తెలిస్తే మాత్రం మీరు షాక్ అయ్యిపోతారు.
ఇంతకీ ఆ రాజు ఎవరో కాదు ఇప్పటి టీవి సీరియల్ స్టార్ ఆర్టిస్ సుజిత ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. తమిళ , మలయాళం, తెలుగు బుల్లి తెరలపై ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతేకాదు చిరుతో చాలా ఏళ్ళ తరువాత జై చిరంజీవ సినిమాలో సోదరిగా కూడా ఈమె నటించింది.