సుశాంత్ కి “అగ్ర రాజ్య” అసెంబ్లీ లో నివాళి…!!!
ఇటీవల ఆత్మ హత్యకి పాల్పడిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణ మిస్టరీ ఇంకా వీడలేదు. అతడి మరణ వార్త విని అభిమానులు చలించిపోయారు, అంతేకాదు అతని ద్వారా సాయం పొందిన ఎంతో మంది అనాధ బాలలు సోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ అతడి మరణంపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇదిలాఉంటే
అగ్ర రాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. సుశాంత్ సింగ్ సినీ రంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకుంది. అలాగే అతడు చేపట్టిన పలు దాతృత్వ సేవా కార్యక్రమాలని గుర్తు చేసుకుని అతడిని రియల్ హీరోగా గుర్తించింది. అంతేకాదు అతడి సేవలని గుర్తించి ప్రశంసా పత్రం కూడా ఇచ్చింది. ఈ పత్రాన్ని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ అందుకున్నారు.