చైనా మరో “భారీ కుట్ర” లిస్ట్ లో రాష్ట్రపతి, ప్రధాని….
భారత్ చైనాల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ప్రస్తుతం కన్పిస్తున్నాయి. భారత్ ని ఎప్పుడు దొంగ దెబ్బ తీద్దామా అంటూ ఎదురు చూస్తున్న కంత్రీ డ్రాగన్ కంట్రీ కి భారత ప్రభుత్వం యాప్స్ తలగిస్తూ దిమ్మతిరిగిపోయేలా షాకుల మీద షాకులు ఇస్తోంది.
ఈ క్రమంలోనే భారత్ పై కక్ష తీర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న చైనా మరో భారీ కుట్రకి తెర తీస్తోందని అంటున్నారు ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ వార్త సంస్థ ప్రకటించింది..భారత రాష్ట్ర పతి, ప్రధానితో సహా సుమారు 10 వేల మంది పై చైనా నిఘా వేసిందని ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ తెలిపింది. అంతేకాదు
పలు రాష్ట్రాల సీఎం లు, సర్పంచులు, రాజకీయ నాయకులతో పాటు సైంటిస్ట్ లు, సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిపింది .చైనా ఐటీ సంస్థ ఓవర్సీస్ కి ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ద్వారా 10 వేల మంది కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నట్టుగా తెలిపింది.