chaitu already know samantha health issue

సమంత వ్యాధి గురించి చైతు కు ముందే తెలుసా…అందుకే వదిలించుకున్నాడా…??

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత అక్కినేని వారసుడు చైతు ను పెళ్లిచేసుకున్న తరువాత సినిమాలకు దూరమవుతుందని అనుకున్నారు అయితే కొంత గ్యాప్ తరువాత సమంతా కొన్ని సినిమాలలో చేయడం అనూహ్యంగా చైతు, సమంతల మధ్య గ్యాప్ రావడం, విడాకులు తీసుకోవడం  జరిగిపోయింది. ఈ క్రమంలో సమంత మానసికంగా ఎంతో సంఘర్షణకు లోనయ్యిందని ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఎవరైనా ఇట్టే అర్థమవుతుంది. ఆ సమయంలో సమంత ఫ్యాన్స్ ఆమెకు ఎంతో అండగా నిలిచారు. అక్కినేని ఫ్యామిలీ పై ఆమె ఫ్యాన్స్ మండిపడ్డారు కూడా…అయితే

రీసెంట్ గా సమంత తాను అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ వ్యాధి వచ్చిన వారు చెప్పలేని విధంగా కండరాల నెప్పులతో భాదపడుతారని, మాయోసైటిస్ అనే వ్యాధి అరుదైనదని నిపుణులు చెప్పడంతో ఆమెపై ఫ్యాన్స్ సానుభూతి విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు గతంలో కంటే కూడా ఆమె ఫ్యాన్స్ అక్కినేని ఫ్యామిలీ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ వ్యాధి గురించి సమంత మాజీ భర్త  చైతు కు ముందుగానే తెలిసి ఉంటుందని అందుకే సమంతను వదిలించుకున్నాడని సోషల్ మీడియాలో చైతు పై మండిపడుతున్నారు. సమంత వైపు నుంచీ ఎలాంటి తప్పు లేకపోయిన కావాలనే ఆమెను వదిలించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వార్తల్లో ఎంత మేర నిజం ఉందో తెలియదు కానీ చైతు ను మాత్రం తెగ ట్రోల్స్ చేస్తున్నారట. కాగా తాజాగా అక్కినేని అఖిల్ “గెట్ వెల్ సూన్ సామ్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సమంత ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ కు గురిచేస్తోంది. మరి సామ్ ఫ్యాన్స్ అఖిల్ పోస్ట్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో , సమంత ఎలాంటి రిప్లై ఇస్తుందో వేచి చూడాలి…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *