తప్పు ఒప్పుకున్న చంద్రబాబు…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకి తప్పు ఒప్పుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ని పట్టించుకోలేదని, కేవలం తాను అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఎక్కువ సమయం వెచ్చించానని అన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల కి తాను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాని తెలిపారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వర్చ్యువల్ మీట్ లో మాట్లాడిన చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు..
భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని పార్టీ నేతలకి హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు సంఘటితం అవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకి టీడీపీ అధికారంలోకి వస్తుందని. కార్యకర్తలకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.