పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్..!!!
దేశ వ్యాప్తంగా పన్ను చెల్లింపు దారుల సంఖ్య అత్యదికంగానే ఉంటుంది. అలాంటి వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ రోజు కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పన్ను చెల్లింపు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇదిలాఉంటే
ఖాతాల ఆడిట్ జరగవలసిన పన్ను చెల్లింపు దారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువును జనవరి 31 -2021 వరకు పొడిగించినట్లుగా ప్రకటించింది.