పాదయాత్ర చేయవచ్చా..షాక్ అయిన డాక్టర్లు..!!!
జగన్ పై దాడి జరిగిన నాటి నుంచీ ఈ నాటి వరకూ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైసీపీ నేతలకి ఏపీ ప్రజలకి మీడియా ముందుకి వచ్చి సమాచారం ఇస్తూనే ఉన్నారు..అయితే ఈరోజు కూడా జగన్ ని పరీక్షించిన డాక్టర్లు గాయం తగ్గలేదని తేల్చి చెప్పారు. ఈ గాయం తగ్గడానికి ఇంకా ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉందని సిటీ న్యూరో సెంటర్ వైద్యుడు డాక్టర్ శివారెడ్డి తెలిపారు.
అయితే జగన్ పై దాడి జరిగిన సమయంలో కోడి కత్తికి విషయం పూసి ఉంటారని అనుమానాలు రావడంతో ఆ బ్లడ్ సాంపిల్స్ ని పరిశీలనకి పంపారు అధికారులు. అయితే రక్త నమూనాలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిందని డాక్టర్ శివారెడ్డి తెలిపారు. ఈ రక్త నమూనాల్లో ఎలాంటి విషం లేదని ఖంగారు పడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఇదిలాఉంటే జగన్ పాదయాత్ర చేయాలని అడుగుతున్నారని కానీ ఈ సమయంలో వద్దని చెప్పిన పాదయాత్ర గురించి మాట్లాడుతున్నరాని అయితే భుజానికి అయిన గాయం వలన మళ్ళీ పాదయాత్ర చేయడంతో అది పెద్దదయ్యే అవకాశం ఉందని మేము తెలిపామని ప్రస్తుతానికి యాత్రకి విరామం ఇవ్వమని చెప్పమని డాక్టర్ శివారెడ్డి తెలిపారు.జగన్ ఇంతటి పరిస్థితులో కూడా పాదయాత్ర చేయవచ్చా అని అడగడంతో అందరూ షాక్ కి గురయ్యామని అన్నారు.