విజ‌య‌వాడ జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థి ఖ‌రారు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటి చేయడానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం  చేసుకున్నారు, ఏ నియోజకవర్గాలలో పోటి చేయాలి, ఎక్కడ జనసేనకి ఎక్కువ బలం ఉంది అనే విషయంలో పవన్ కి ఒక క్లారిటీ ఉంది.ఇప్పుడు పవన్ నటిస్తున్న సినిమాలు కంప్లీట్ అవ్వగానే పూర్తి స్థాయిలో రాజకీయాలమీద దృష్టి సారించబోతున్నాడు పవన్

అటు తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భవించే పార్టీతో కలిసి పోటి చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు పవన్ ఇక ఆంధ్రా లో  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే ఛాన్సులు త‌క్కువ‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న టీడీపి తోనే పవన్ జతకడుతాడు అనడంలో సందేహం లేదు   జనసేన నుండీ పోటి చేసే అభ్యర్ధుల విషయంలో విజ‌య‌వాడ ఎంపీ సీటును ప‌వ‌న్ త‌నకు అత్యంత స‌న్నిహితుడు, జ‌న‌సేన ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించ‌డంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన పీవీపీ కి ఇస్తాన‌ని మాట ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

janasena chandrababu కోసం చిత్ర ఫలితం

పివిపి వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ,టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ జ‌న‌సేన ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించ‌డంతో పాటు ఆ పార్టీ ఏర్పాటుకు బ్యాక్ బోన్‌గా ఉన్నార‌న్న టాక్ కూడా వ‌చ్చింది. అప్పట్లోనే ఎంపీ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న పివిపి చంద్రబాబు కేసినేని నానికి మాట ఇవ్వడంతో పివిపి కి నిరాశే ఎదురయ్యింది.

ఇన్నాళ్ళకి మళ్ళి పవన్ సపోర్ట్ తో జనసేన తరుపున విజయవాడ ఎంపీ టిక్కెట్ కాంఫోర్మేడ్ అయ్యిందని సమాచారం.
ఒకవేళ జనసేన టీడీపి పొత్తు ఉన్నా సరే విజయవాడ ఎంపీ సీటు మాత్రం జ‌న‌సేన‌కే కోర‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. మొత్తానికి ఇంకా పూర్తీ స్థాయిలో పవన్ రాజకీయాలలోకి రానే లేదు ఇప్పుడే ఇన్ని లాబియింగ్ లా అని అనుకుంటున్నారు ప్రజలు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *