మొదలైన కాకినాడ కౌంటింగ్…

నంద్యాలలో వైఎస్సార్ పార్టీ ఓటమి తరువాత అన్ని పార్టీలు వేచిచూస్తున్నది కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయం ఎవరిని వరిస్తుందో అధికార పార్టీ కి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకప్రక్క మాకు విజయం తధ్యం అని వైఎస్సార్ పార్టీ ఆశాభావంతో ఉంది.

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది . కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 48 డివిజన్లకు 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఏ రౌండ్ కి ఆ రౌండ్ ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. తక్కువ ఓట్లు పోలైన డివిజన్‌ ఫలితాలు ఉదయం 11 గంటలకల్లా వెలువడతాయి. ఒంటిగంట లోగా మొత్తం అన్ని ఫలితాలు వెలువడతాయి. ఎంతో ఉత్ఖంతని రేపుతున్న ఈ కార్పొరేషన్ ఎన్నిక ఫలితం ఎవరిని వరిస్తుందో చూడాలి.ఇప్పటికే నగరం మొత్తం భారీ భందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *