రెస్టారెంట్ మూసేసిన కిరాక్ ఆర్పీ…రీజన్ ఇదేనా….
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన కిరాక్ ఆర్పీ ఆ షో నుంచీ బయటకు వచ్చిన తరువాత నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ లో మానేసిన తరువాత నుంచీ ఆర్పీ కి సరైన అవకాశాలు రాలేదు ప్రస్తుతం ఈ రెస్టారెంట్ ను మాత్రమే నమ్ముకున్న కిరాక్ ఆర్పీకి సోషల్ మీడియా పుణ్యమా అని భారీగానే పబ్లిసిటీ దొరికింది పైగా నెల్లూరు వారితో చేపల పులుసు చేయించడంతో పాటు తానే స్వయంగా ఒక్కోసారి చేపల పులుసు చేయడంతో రెస్టారెంట్ పై ప్రజలకు అంచనాలు పెరిగిపోయాయి. దాంతో…
ఆర్పీ రెస్టారెంట్ కు భారీగా జనాలు తరలి రావడం మొదలు పెట్టారు. షాపు ముందు క్యూ కట్టడం మొదలు పెడితే రోడ్డు దాటి మరీ క్యూ ఉంటోందట. దాంతో ఆర్పీ పంట పండినదని అనుకున్నారు అందరూ కానీ తాజాగా ఆర్పీ తన రెస్టారెంట్ ను మూసేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే..
ఆర్పీ ఊహించని దానికంటే రెండింతలు రెస్పాన్స్ రావడం జనాలు తంబలు తంబలుగా క్యూ కట్టడంతో వచ్చే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. చిన్న రెస్టారెంట్ కావడంతో త్వరలో మరిన్నీ మార్పులు చేర్పులు చేసి కస్టమర్లు ఇబ్బందులు పడకుండా త్వరలో రెస్టారెంట్ ను తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా జబర్దస్త్ నుంచీ బయటకు రావడమే ఆర్పీ కి బాగా కలిసివచ్చిందని అంటున్నారు ఆయన అభిమానాలు.