ముఖేష్ అంబానీకి బిగ్ షాక్..!!!
వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కి సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు బిగ్ షాక్ ఇచ్చాయి. దేశంలోనే అత్యధిక ధనవంతుడుగా పేరొందిన ముఖేష్ అంబానీ ఎప్పుడూ లాభాల బాటలో తప్ప నష్టాలు చవిచూసిన సందర్భాలు తక్కువే అయితే. కొన్ని నెలలుగా రిలయన్స్ స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో నమోదు కాగా తాజాగా సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలలో మాత్రం ముకేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయారు.
రిలయన్స్ స్టాక్ 8. 69 శాతం క్షీణించి రూ. 1876 వద్ద ముగిసింది. మార్చి 23 తరువాత ఇదే భారీ పతనమని అంటున్నారు నిపుణులు. రిలయన్స్ మార్కెట్ క్యాప్ కూడా బాగా పడిపోయిందని కేవలం ఒకే ఒక్క రోజులో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 12 లక్షల కోట్ల రూపాయల మేరకు క్షీణించిందని తెలిపారు నిపుణులు.