కాకినాడలో ప్రజా పోరాట యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు తృటిలో ప్రమాదం తప్పింది.ఆయన వాహనశ్రేణి లో ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది…దాంతో పవన్ కళ్యాణ్ కి ఏమన్నా అయ్యిందేమో నని ఒక్క సారిగా అందరూ కంగారు పడిపోయారు..అయితే ఎవరికీ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..వివరాలలోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ పెను ప్రమాదం జరిగింది…కంటి రెప్ప పాటులో జరిగిన ఈ ప్రమాదం అందరికి ఒక్క సారిగా షాక్ కి గురిచేసింది..అయితే వాహనం డీ కొట్టిన దానిలో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ ప్రయాణిస్తున్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.