ఆ భారతీయ మహిళ…”క్వీన్ ఎలిజిబెత్” కంటే ధనవంతురాలా..!!
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐటీ దిగ్గజ సంస్థకు ఆయనో అధిపతి. తన కూతురును బ్రిటన్ మంత్రిగా ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునక్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రిషి సునక్ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అక్కడి రాజకీయ నియామావళి ప్రకారం ఆయన తన ఆస్తులతో పాటు,
భార్య, తల్లి తండ్రులు, అత్త , మామల ఆస్తులు కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇవేమీ ఆయన ప్రకటించలేదని, ఆమె భార్య బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్ కంటే కూడా ధనవంతురాలని ప్రముఖ మీడియా సంస్థ గార్డియన్ ప్రచురించింది.
ఆర్ధిక మంత్రిగా ఉన్న రిషి సునక్ తన ఆర్ధిక విషయాలు తొక్కి పెట్టారని సంచలన ఆరోపణలు చేసింది. రిషి సునక్ ఎన్నిక కాబడినప్పుడు తాను కేవలం యూకే ఆధారిత వెంచర్ క్యాపిటల్ కి యజమానిని మాత్రమేనని తెలిపారు కానీ వారి భందువుల ఆస్తుల వివరాలు మాత్రం వెల్లడించలేదని తెలిపింది. దాంతో రిషి సునక్ ఆస్తుల విషయం వివాదాస్పదంగా మారింది