తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగన్ పై కోడి కత్తి దాడి కేసు చిలికి చిలికి తుఫానుగా మారుతోంది..కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు చంద్రబాబు తీరు పై విమర్శలు చేస్తోంటే కాంగ్రెస్ మాత్రం బాబు ని వెనకేసుకు వస్తోంది. ఇదిలాఉంటే జగన్ పై దాడి ఘటన లో చంద్రబాబు నాయుడు ని A1 ముద్ధాయిగా చేస్తూ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసేపీ నేత రోజా సంచలన వ్యాక్యాలు చేశారు.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు శిక్ష తప్పదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు.. అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. జగన్పై కోడికత్తి దాడి కేసులో చంద్రబాబే ప్రథమ ముద్దాయని రోజా విమర్శించారు.