సచిన్ ఎంత గొప్ప మనసయ్యా నీది…!!
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు సేవా కార్యక్రమాలలో పేదలకు మంచి చేయడంలో ఎప్పుడూ ముందుండే సచిన్ టెండూల్కర్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 100 మంది పేద పిల్లలకు చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి మరోసారి వార్తల్లో నిలిచారు.
గతంలో కూడా ఓ ఊరు ఊరు పడుతున్న బాధలను చూసిన సచిన ఆ ఊరుని దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన విషయం అందరికి తెలిసిందే. సాయం అంటూ ఎవరు వచ్చినా కాదనకుండా వారికి సహకరించే సచిన్ సుమారు 100 మంది పేద పిల్లలకు అండగా నిలబడటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏకాం సంస్థ తెలిపింది.
అసోమ్ ,కర్ణాటక, తమిళనాడు, ఏపీ, పశ్చిమ బెంగాల్ ,మహారాష్ట్ర, వంటి రాష్ట్రాలలో ఉన్న పేద పిల్లలకు ఏ కాం ఫౌండేషన్ తో కలిసి సాయం చేశారు సచిన్. పేద పిల్లలకు సాయం చేయడానికి సచిన్ ఎప్పుడు ముందుంటారని అడిగిన వెంటనే సాయం చేయడానికి ముందకు వచ్చారని ఏ కాం ఫౌండేషన్ మేనేజింగ్ పార్టనర చటర్జీ తెలిపారు.