వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ…
ఏపీలో 2019 ఎన్నికల వేళ రాజకీయం రంజుగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అప్పుడే కప్పదాట్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ మాజీ మంత్రి తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ ఆయనకు ఓకే చెప్పేశారు. మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పోటీ చేయని ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల రామారావు ఆపరేషన్ ఆకర్ష్ నపథ్యంలో టీడీపీలోకి జంప్ చేసేశారు.
దీంతో ప్రస్తుతం కందుకూరులో వైసీపీకి బలమైన నాయకత్వ కొరత ఉంది. దీంతో ఇప్పుడు మహీధర్రెడ్డి వైసీపీలో చేరడం జగన్కు చాలా వరకు కలిసిరానుంది. పార్టీలో చేరుతోన్న మానుగుంటకే జగన్ 2019 ఎన్నికల్లో కందుకూరు టిక్కెట్ ఖాయం చేశారట. ఇక మానుగుంట వైసీపీ ఎంట్రీ ప్రకాశం జిల్లాలో వైసీపీకి చాలా కలిసి రానుంది.