సర్జికల్ స్ట్రైక్ -2 క్లారిటీ ఇచ్చిన భారత ఆర్మీ…!!
భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన సర్జికల్ స్ట్రైక్ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ తరువాత మోడీ పై ప్రశంసల జల్లు కురిసింది. పలు దేశాలు కూడా మోడీ ని ఆకాశానికి ఎత్తేసాయి. ఇప్పటికి అప్పటి వీరోచితమైన పోరాటం తలుచుకుంటే రోమాలు నిక్కబోడుచుకుంటాయి. అయితే తాజాగా మరో సారి పాకిస్తాన్ పై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ – 2 చేపట్టిందని, ఉగ్రవాదులు లెక్కకి మించి చనిపోయారని, వార్తలు సోషల్ మీడియాలో, పలు చానల్స్ లో వెలుగు చూసాయి.
గడిచిన కొన్ని రోజులుగా భారత్ – పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న పోరు తెలిసిందే ఈ నేపధ్యంలో సర్జికల్ స్ట్రైక్ -2 జరిగిందనే వార్తలు రావడంతో అందరూ నిజమేనని అనుకున్నారు. కానీ ఈ విషయం విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపధ్యంలో భారత ఆర్మీ క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేని తెలిపింది.