బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..
కరోన మహమ్మారి పేరు చెప్తేనే ప్రజలు చలి జ్వరం వచ్చిన వారిలా వణికి పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కరోనా కాటుకు బలైపోతున్నారు. ఈ మహమ్మారికి కులం, మతం, ప్రాంతం లేదు, ధనిక, పేద తేడా లేదు అందరిని ఒకే సారి హోల్ సెల్ గా చుట్టుముట్టేస్తోంది. ఇక భారత్ త్వరలో అమెరికాని దాటి పోతుందని నిపుణులు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు…ఇదిలాఉంటే
ఏపీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కరోన బారిన పడ్డారు. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం..
కోటం రెడ్డి వైద్య సేవలు అందిస్తున్నారు, ఆయన కుటుంభ సభ్యులకి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు తెలుస్తోంది. కోటం రెడ్డి శ్రీధర్ ఆసుపత్రిలో ఉన్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. తమ నాయకుడు కోలుకోవాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.