సంచలన పిటిషన్..జగన్ ను సీఎం పదవి నుంచీ తొలగించండి..!!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తొలగించాలంటూ సుప్రీం కోర్టు లో ఓ పిటిషన్ దాఖలయ్యింది. న్యాయమూర్తి ఎస్ వీ రమణపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ మోహన్ రెడ్డి లేఖని రాసిన విషయం విధితమే. అయితే సీఎం స్థాయి వ్యక్తే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు సరిచేయండి అంటూ డిమాండ్ చేయడంతో ఒక్క సారిగా ఈ విషయం సంచలనం సృష్టించింది. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ లోని హై కోర్ట్ బార్ అసోసియేషన్ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది.అయితే
ఏపీ ముఖ్యమంత్రిని పదవి నుంచీ తొలగించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్, సుప్రీం కోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు ఇందులో జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు న్యాయవాదులు.
జగన్ మోహన్ రెడ్డి పై దాదాపు 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జ్ ఎస్వీ రమణపై ఆరోపణలు చేయడం దారుణమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ దసరా సెలవుల తరువాత విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.