nayanathara surrogacy not break laws

నయన్ అభిమానులకు గుడ్ న్యూస్……వివాదానికి తెర పడింది…!!

నయనతార, లేడీ సూపర్ స్టార్ గా అందరి హృదయాలను గెలుచుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. వ్యక్తిగతంగా  ఫేవరేట్ హీరొయిన్ ఎవరైనా సరే, నయన్ ను  ఇష్టపడని వాళ్ళంటూ ఉండరేమో. దానికి కారణం ఆమె అందం, నటన మాత్రమే కాదు ఆమె ప్రవర్తన, వ్యక్తిత్వం. ఇప్పటివరకు ఆమె కెరీర్ లో ఎన్నో  విజయాలను సొంతం చేసుకుంది, అలాగే ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కుంది. అయితే ఏ విషయంలోనూ నయన్ కుంగిపోలేదు. గడిచిన కొన్ని రోజులుగా తన చుట్టూ జరుగుతున్న రచ్చ పై ఎలాంటి తొందరపాటు పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది.

నయన్ , విగ్నేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటి పెళ్లి చేసుకుంది కదా  అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హాపీ ఫీల్ అయ్యారు. ఈ లోగా ఈ దంపతులు పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగాసి ద్వార ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఇక్కడే మొదలైంది అసలు వివాదం.. అదేంటి ఇలా ఎలా సాధ్యం అంటూ, ఈ జంటను ఎవరికి  తోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలకు గురిచేశారు. ఒకవిధంగా చెప్పాలంటే నయన్  ఇమేజ్ ను డామేజ్ చేస్తూనే ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టారు….ఈ విషయం కాస్తా రచ్చ రచ్చ అవ్వడంతో…

తమిళనాడు ప్రభుత్వం ఈ విషయమై విచారణకు ఒక కమిటిని వేసింది. అయితే ఆ కమెటీ చేపట్టిన సుదీర్ఘమైన విచారణ తరువాత వీరి ఇరువురి  సరోగాసి చట్టబద్ధమైనదేనని, వీరి వివాహం 2016 జరిగిందని, 2021 నవంబర్ లో ఈ సరోగసి కి అగ్రిమెంట్ జరిగిందిని, ఈ ప్రక్రియ మొత్తం  నిభందనలకు అనుగుణంగానే జరిగిందని  తన నివేదికలో వెల్లడించింది. దాంతో ఈ స్టార్ కాపుల్ పై వస్తున్న విమర్శలకు చెక్ పడిందనే చెప్పాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *