బిగ్ బ్రేకింగ్ : ఉపరాష్ట్రపతి కి కరోనా పాజిటివ్..!!
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే భారత దేశంలో మొత్తం 60 లక్షల పై చీలుకు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 90వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏంటో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఈ కరోనా మహమ్మారి దాటికి బలై పోయారు. కొందరు త్వరగా కోలుకోగా మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వెంకయ్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఎలాంటి లక్షణాలు లేవని కానీ పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హౌస్ ఐసోలేషణ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే ఆయన సతీమణి ఉషకు నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.