వరద బాధితులకి పవన్ రూ. కోటి సాయం..!!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి తన దాతృత్వాన్ని చాటారు. అకాల వర్షాలతో నీట మునిగిన తెలంగాణా రాష్ట్రానికి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణా చరిత్రలో ఎన్నడూ లేనంతగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వీధుల్లో ప్రజలు పడవలలో బయటకి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు పక్కలే నివాసం ఉంటున్న ఎంతో మంది పేదలు నిరాశ్రాయులయ్యారు. కుటుంభ సభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితులు ప్రతీ చోట కనపడుతున్నాయి. ఈ క్రమంలో
సినిమా హీరోలు ఒకొక్కరుగా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ముందుగా నందమూరి బాలకృష్ణ తెలంగాణా ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్ధం రూ. 1.50 లక్షలు ప్రకటించారు. తరువాత చిరు, ప్రభాస్, మహేష్ బాబు ఒక్కొక్కరు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. నాగార్జున ఎన్టీఆర్ రూ. 50 లక్షలు ప్రకటించగా తాజాగా హీరో పవన్ కళ్యాణ్ రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు.